Pages

SSC EXAMINATION FEE -2023

టెన్త్‌ ఫీజు గడువు 24 వరకు పొడిగింపు




*🍥వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 24వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం రూ.50తో వచ్చేనెల ఐదో తేదీ వరకు, రూ.200తో అదేనెల 15 వరకు, రూ.500తో 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. ఆయా తేదీల్లో సాధారణ సెలవులుంటే మరుసటి రోజు చెల్లించొచ్చని సూచించారు. విద్యార్థులు ఇతర సమాచారం కోసం www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.*




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.